అపార్ధం చేసుకోవద్దు
లత గ్రామీణ బ్యాంకులో ఉద్యోగి. ఆ బ్యాంకుకి ఆమె మేనేజర్. ఉదయం బ్యాంకుకివెళ్ళే హడావుడిలో ఉండగాఆమె తల్లి అహల్యగారు బాత్రూంలో పడిపోయారు.హుటాహుటిన ఆమెను
సిటీకి తీసుకుని వెళ్లిహాస్పిటల్లో జేర్చారు.ఆ గ్రామంలో హాస్పిటల్లేకపోవటంతో సిటీకితీసుకుని వెళ్ళారు. లతహాస్పిటల్ కు వెళ్ళేటప్పుడుబ్యాంకుకి ఫోన్ చేసిందిఎవరూ లిఫ్ట్ చెయ్యలేదు.
సరే తర్వాత ఫోన్ చేద్దాంఅని ఫోన్ పెట్టేసింది. ఆతర్వాత ఆ విషయమేమర్చిపోయింది. అమ్మట్రీట్మెంట్ మీద దృష్టి పెట్టిబ్యాంకుకు ఫోన్ చేయటంమర్చిపోయింది. బ్యాంకుకివచ్చిన గ్రామీణ ప్రాంత ప్రజలుమేనేజర్ లేకపోవడంతో విసుక్కోసాగారు. మరో ఉద్యోగిని కూడా శెలవపెట్టడంతో బాధ్యతలునెరవేర్చే అధికారులుబ్యాంకులో లేరు. అదేసమయంలో ఆ ప్రాంత
ఎమ్మెల్యే కూడా ఒకపనిమీద బ్యాంకుకువచ్చాడు. బ్యాంకుఅధికారుల నిర్లక్ష్యధోరణిని తీవ్రంగా
విమర్శించాడు. ప్రజలు కూడా ఆందోళన చేయసాగారు.
అదేసమయంలో బ్యాంకు అటెండర్వచ్చి ఎమ్మెల్యేతో”చూడండి సార్, బ్యాంకుకి వచ్చే ముందేమేనేజరు గారి అమ్మగారికితీవ్రంగా సుస్తీ చేసింది.అందుకే ఆమె రాలేదు. ఈ లోపు మీరు రచ్చ – రచ్చ చేసారు. ఆవిడ చాలాబాధ్యత గల మనిషి.మీరు అపార్ధం చేసుకున్నారు.”అన్నాడు. అసలు విషయంతెలుసుకుని ఎమ్మెల్యేతో పాటుఅక్కడ ఉన్న ప్రజలు చాలా బాధ పడ్డారు. అనవసరంగామేనేజరును అపార్ధం చేసుకున్నాం కదా అని ఫీలయ్యారు. అందరూమేనేజర్ గారి అమ్మగారిని
పలకరించటానికి వెళ్ళారు.
ఒకోసారి అసలు విషయం తెలియకుండా ఇతరులను
అనవసరంగా అపార్ధం చేసుకుంటాం.
-వెంకట భానుప్రసాద్ చలసాని