వసుదైక కుటుంబం
పద్మావతి రాజి రెడ్డి దంపతులకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు..
ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసారు పిల్లలను..
పెళ్లి వయసు రాగానె పెద్ద కొడుకు శ్రీధర్ కు పెళ్లి చేసారు కోడలు కొంత కాలం బాగానె ఉంది కానీ కొంత కాలానికి వేరు కాపురం పెట్టేసింది..
పెద్ద కూతురు మంజుల ఎవరినో ప్రేమించి ఇంట్లోంచి వెళ్లి పోయింది.
ఇక ఆమె ఊసు కూడా ఆ ఇంట్లో వినిపించ కూడదని గట్టి వార్నింగ్ ఇచ్చాడు రాజి రెడ్డి దాంతో ఆ కూతురు చనిపోయిందనే భావించే వాళ్లు..
మిగతా ఇద్దరి పెళ్లిల్లు బ్రహ్మాండంగా జరిపించారు రాజిరెడ్డి గారు..
దాంతో చిన్న కొడుకు శ్రీకాంత్ ఉధ్యోగ రీత్యా కోడలును తీసుకుని వేరే ఊరికి వెళ్లాడు కూతురు అత్తారింటికి వెళ్లడంతో ఆ లంకంత ఇళ్లు బోసి పోయింది..
బెంగతో సగం చచ్చి పోయారు ఆ దంపతులు..
కానీ సరిగ్గా అప్పుడే వేణు అనే అతను బలగం అనే సినిమా తీసాడు..
ఎక్కడి వాళ్ళు అక్కడే ఆ సినిమా చూసి విపరీతమయిన బాధతో ప్రేమ నిండిన హృదయాలతో అందరూ ఆ ఇంటికి చేరారు వెల వెలయిన ఆ పాత ఇల్లు మళ్ళి ఇప్పుడు కొత్త కళతో బృందావనంలా మారింది మళ్లీ!
వేరు కాపురం పెట్టిన పెద్ద కొడుకు, ఉధ్యోగం కోసం వెళ్లిన చిన్న కొడుకు, వ్యవసాయం చేసుకుంటూ అమ్మా నాన్నలతో కలిసి వసుదైక కుటుంబం లాగ ఉంటున్నారు..
అదండి సంగతి..
-ఉమాదేవి ఎర్రం..