నిజాన్ని దాయవలసిన సందర్భాలు

నిజాన్ని దాయవలసిన సందర్భాలు

మహాత్మాగాంధీజీ సత్యం, అహింస అనే ఆయుధాలతోస్వాతంత్ర సమయంలో పాల్గొని మన దేశానికిస్వాతంత్రo సిద్ధించేటట్లుచేసారు.

మనకు జాతిపితగానిలిచారు. నిజానికంత శక్తిఉంది. పురాణ కాలంలో కూడారాజా హరిశ్చంద్రుడు సత్యంకోసం తన రాజ్యాన్ని, కుటుంబాన్ని త్యాగం చేసిసత్యహరిశ్చంద్రుడు అనిఅచంద్రతారార్కం ఉండేలాకీర్తిని సంపాదించాడు.

అదిచాలా గొప్ప విషయమే. అయితే కొన్ని సందర్భాల్లోఅబద్ధం చెప్పినా మనకుపాపం అంటదని శాస్త్రంచెబుతోంది. వారిజాక్షులందు వైవాహికములందు,ప్రాణ విత్త మాన భంగమందుచకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు
బొంక వచ్చు.

నఘము వొంద దధిప అని పోతన తనభాగవత గ్రంధలో వ్రాసారు.ఆడవారిని కాపాడే విషయంలోకానీ;ప్రాణానికి,ధనానికి,గౌరవానికి భంగంకలిగేటప్పుడు కానీ;

గోవులను,విప్రులను కాపాడేటప్పుడుఅబద్ధం చెప్పవచ్చు. దానివల్లఏ పాపం రాదు అని శుకృడుఆ బలిచక్రవర్తితో అన్నట్లుపోతనగారు వ్రాసారు.

ఆవిధంగా సందర్భాన్ని బట్టి సత్యాన్ని దాయవచ్చు అనేది
శాస్త్ర ప్రమాణంగా నిలిచింది.

-వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *