దాహం
దాహం తీర్చేది నీళ్లు..
మంటను ఆర్పేది నీళ్లు..
జన జీవకోటికి ..
అవసరమయ్యేది నీళ్లు..
ప్రకృతి ఉచితంగా..
మనిషికి అమృతంగా..
ప్రసాదించింది నీళ్లను..
కానీ…
ఆ మనిషి స్వఛ్చమయిన..
నీటిని కల్తీ చేసి వ్యాపారం..
చేస్తూ..
నీటిని కొనుక్కునే దుర్గతి..
తెచ్చాడు..
ఆ అమృతమైన నీటిని..
విషంగా మారుస్తున్నాడు..
ఎక్కడి నీళ్లు తాగితే..
ఏమవుతుందోననే భయం..
కలిగిస్తున్నాడు..
నీరు,గాలిని తను ప్రాణంగా..
చూసుకోమంటె ..
అపవిత్రం చేస్తున్నాడు..
తన ప్రాణం మీదకు తనే..
ముప్పు తెచ్చుకుంటున్నాడు..
ప్రకృతిని కాపాడుకోవాలనే..
ఇంగిత జ్ఞానం మరిచాడు..
నేటి మానవుడు..
నీళ్లే మనిషికి జీవనాధారం..
బొట్టు బొట్టును కాపాడుదాం!!
నీటి విలువను గుర్తిద్దాం!!
ఉమాదేవి ఎర్రం