తిరుమల గీతావళి
పల్లవి
అందరి వేలుపు నీవయ్యా
ఆదుకునేందుకు రావయ్యా
ఆపదమొక్కులు మావయ్యా
అవి తీర్చేవాడివి నీవయ్యా
చరణం
కాలం కలిసి రానపుడు
కన్నీరే మా తోడయితే
నీవంకే మే చూచెదము
మార్గము మాకు చూపమని
చరణం
ఏడుకొండలది ఎంతందం
నీ చెంతే ఉండే అదృష్టం
చెట్టు చేమ కొండ కోనా
పులకించునుగా ప్రతినిత్యం
చరణం
గోవిందాయని పిలిచితిమా
మదిలో గంటే మోగునుగా
నీ ధ్యానముతో సాగితిమా
ఆకలిదప్పులు ఉండవుగా
చరణం
కలలన్నీ మావయితే
అవి తీర్చేవాడివి నీవేగా
ఆపదనందున మేముంటే
పరుగు పరుగున వస్తావు
-సి.యస్.రాంబాబు